calender_icon.png 14 September, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్లు, వీధి దీపాలకు నిధులు మంజూరు

13-09-2025 10:02:44 PM

చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్, మండల పరిధిలో సీసీ రోడ్లు, వీధి దీపాలకు హెచ్ ఎండిఎ నుంచి  రూ.10  కోట్లు మంజూరయ్యాయి. దీంతో స్థానిక నాయకులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవతోనే  నిధులు మంజూరయ్యాయని కొనియాడారు. మున్ముందు మరిన్ని నిధులు తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.