13-09-2025 10:02:44 PM
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్, మండల పరిధిలో సీసీ రోడ్లు, వీధి దీపాలకు హెచ్ ఎండిఎ నుంచి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. దీంతో స్థానిక నాయకులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవతోనే నిధులు మంజూరయ్యాయని కొనియాడారు. మున్ముందు మరిన్ని నిధులు తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.