8 July, 2026 | 7:33 PM

నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

20-07-2024 05:35 PM
మేడ్చల్: నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠాను షాపూర్ నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 100 నకిలీ బంగారు నాణేలు, రూ.36 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బంగారు నాణేలను విజయవాడలో తయారు చేయించిన ముఠా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.