calender_icon.png 29 July, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన బిల్లులు ఇవ్వండి

25-07-2025 01:17:44 AM

  1. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మిడ్ డే మీల్స్ కార్మికుల వినతి
  2. కేంద్రం బిల్లులన్నీ క్లియర్ చేసిందని సమాధానమిచ్చిన మంత్రి

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన నిధులను విడుదల చేయాలంటూ రాష్ట్రానికి చెందిన మిడ్ డే మీల్స్ కా ర్మికులు గురువారం కేంద్రమంత్రులు ధ ర్మేంద్ర ప్రధాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి తమ సమస్యలు వి న్నవించుకున్నారు.

అయితే ఇందుకు సంబంధించిన నిధులను కేంద్రం ఇప్పిటేక విడుదల చేసిందని ధర్మేంద్ర ప్రధాన్ వారికి చెప్పారు. రాష్ట్రంతో ఈ అంశంపై మాట్లాడి బిల్లులు చె ల్లించేలా చూస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. మిడ్ డే మీల్స్ కార్మికుల గౌరవ వే తనం రూ.17 వేలకు పెంచాలని ఈ సందర్భ ంగా వారు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేయగా.. ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు.