25-07-2025 01:20:07 AM
కేఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఇల్లెందు, జులై 24, (విజయక్రాంతి): జిల్లాలో గత రెండు రోజులు కురుస్తున్న ఏడతెరిపిలేనివర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్ప త్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి ఇల్లందు ఏరియాలోని కొయగూడెం ఓపెన్ కాస్ట్ లో భారీగా నీరు చేరుకొన్న కారణంగా బొగ్గు (కోల్) ఉత్పత్తి నిలిచిపోయింది.
టెకులపల్లి మండలంలోని కొయగూడెం ఓసి లో రాత్రిపూట వచ్చిన భారీ వర్షాలతో మైన్లో నీరు నిలిచిపోయింది. దాంతో 5%వేల టన్నుల కోల్ ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది. ఇదే వర్షం ఇల్లందులో జెకే 5 ఓసిలో కూడా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.