8 June, 2026 | 7:37 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

సింధూ, లక్ష్యసేన్ శుభారంభం

21-11-2024 12:00 AM

చైనా మాస్టర్స్ సూపర్ 750

షెంజెన్ (చైనా):  చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సింధు, లక్ష్యసేన్, మాళవిక రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ప్రపంచ 19వ ర్యాంకర్ సింధు 21-17, 21-19 తేడాతో బుసానన్ (థాయలాండ్) ను ఓడించింది. రెండో రౌండ్‌లో ఈ హైదరాబాదీ షట్లర్ సింగపూర్‌కు చెందిన జియా మిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

మరో యంగ్ ప్లేయర్ మాళవిక బన్సోద్ 20-22, 23-21, 21-16 తేడాతో హోజ్‌మార్క్ (డెన్మార్క్) మీద విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.  పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-14, 13-21, 21-13 తేడాతో లీ జీ జియా (మలేషియా) మీద విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ జంట 12 21-19, 21-18 తేడాతో చెన్ జి రే- లిన్ యు (చైనీస్ తైపీ) జోడీని ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.