calender_icon.png 26 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బందికి గవర్నర్ దుస్తులు పంపిణీ

26-08-2025 02:46:09 AM

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాం తి): భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోని ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ధోతీలు, చీరలు, టీ-షర్టులు, దుప్పట్లను  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపిణీ చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గార్డెన్ మాలీలు, హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో  అంకితభావంతో సేవలు అందిస్తున్న కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.

ఆశ్రమం నిస్వార్థ సేవలను గవర్నర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్, భారత్ సేవాశ్రమ సంఘం ప్రతినిధి స్వామి వెంకటేశ్వరానంద మహరాజ్, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు.