27 July, 2026 | 12:29 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం

31-10-2025 10:04 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు శుక్రవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లోని పోతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని మండలాలకు చెందిన 57 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల బిల్లులను పంపిణీ  చేయడం జరిగిందన్నారు.

వర్ని మండలం పాత వర్ని, జలాల్ పూర్, జకోరా, SN పురం గ్రామాలకు చెందిన 24 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 82,41,056/- ,పోతంగల్ సుంకిని  గ్రామానికి చెందిన 20 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 56,44,800/- , కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంప్ గ్రామానికి చెందిన 05 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 16,12,800/- ,రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన 8 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 24,18,474/- , మొత్తం 57 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 1,79,17,130/-పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.