calender_icon.png 14 May, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

14-05-2025 01:20:32 AM

కలెక్టర్ సత్యప్రసాద్ 

జగిత్యాల, మే 13 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ మేరకు కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలం ఆరపేట, ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, మల్లాపూర్ మండలం సాతారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు.  కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.శ్రీనివాస్, డీఎస్‌ఓ, డిఎం, ఆయా మండలాల  తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.