3 July, 2026 | 8:46 PM

Breaking News

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •  

నగరంలో కమ్యూనిటీ భవనానికి భూమిపూజ

01-08-2025 12:19 AM

ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే దన్‌పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, జులై 31: (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్, ఓల్ ఎన్జీఓఎస్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ధన్ పాల్ సూర్యనారాయణ .

మాట్లాడుతు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణల అవసరం ఉందని అన్నారు, నిర్మా ణానికి ముందుకు వచ్చిన కాలనీ అసోసియేషన్ వారిని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అభినందించారు. ఇది స్థానిక కాలనీ వాసులకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ప్రజల ఉపయోగం కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం పనులు త్వరతగతిన ప్రారంభం అయ్యి ప్రజా ఉపయోగంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, మాజీ కార్పొరేటర్ క్రిష్ణ, కొండా ఆశన్న, ఇల్లేందుల ప్రభాకర్, పార్షి రాజు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.