15-08-2025 01:17:35 AM
ఈ నెల 20 వరకు రాష్ట్రంలో వానలు
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాం తి): ఉత్తర తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఆదిలా బాద్, జయశంకర్ భూపాలపల్లి, కామా రెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
శనివారం ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్.. హన్మకొండ, జగిత్యాల కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.