15-08-2025 05:26:12 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్బిఐ ఎదురుగా గల శాంతిఖని ఆటో స్టాండ్ వద్ద ఆటో యూనియన్ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ జాతీయ జెండాలు ఎగురవేశారు. ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా స్వాతంత్ర వేడుకలను జరుపుకోవడం శుభ పరిణామమని అన్నారు. ఆటో యూనియన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి ఖని ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.