12 July, 2026 | 3:11 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

నాకు ఆరుగురు పిల్లలున్నారు!

07-01-2026 12:00 AM
  1. మీరెందుకు కనడం లేదు?
  2. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ 
  3. బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్‌కు కౌంటర్

ముంబై, జనవరి ౬: తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారని.. మీరెందుకు ఎనిమిది మందిని కనడం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దేశ జనాభా సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి హిందువూ కనీసం నలుగురు పిల్లల చొప్పున కనాలని ఇటీవల బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలోని అకోలాలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నవనీత్ కౌర్ పేరు ఎత్తకుండానే చురకలటించారు.

కొందరు వ్యక్తులు నలుగురు పిల్లలను కనాలని చెబుతున్నారని, నలుగురు మాత్రమే ఎందుకు.. ఎనిమిది మందిని కనాలని ఎద్దేవా చేశారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలని అన్నారని గుర్తు చేశారు. వారంతా కావాలంటే 20 మంది చొప్పున కంటే బాగుంటుందన్నారు.