12 July, 2026 | 2:26 PM

Breaking News

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •  

టీవీకే అధినేత విజయ్‌కి సీబీఐ సమన్లు

07-01-2026 12:00 AM
  1. కరూర్ తొక్కిసలాట కేసులో నోటీసులు
  2.   12న ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి విజయ్

న్యూఢిల్లీ, జనవరి 6: కరూర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా ఈనెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని టీవీకే అధినేత విజయ్‌కి మంగళవారం సమన్లు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులో కరూర్‌లో విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయాలపాలైన సంగతి తెలిసిందే.

తమిళనాడు ప్రభుత్వం ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించగా, సిట్ దర్యాప్తుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీం కోర్టు జోక్యంతో కేసు సీబీఐ టేబుల్‌పైకి వెళ్లింది. సీబీఐ అధికారులు ఇప్పటికే ఈ కేసులో సుమారు 200 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈక్రమంలోనే తాజాగా విజయ్‌కి సమన్లు జారీ చేసింది.