09-05-2025 03:37:40 AM
వాషింగ్టన్ మే ౮: ఉద్రిక్తతల నివారణకు భారత్, పాక్ ప్రయత్నించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన భారత విదేశాంగమంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించా రు. ఉగ్రవాదాన్ని సహిం చబోమని స్పష్టం చేశారు.