calender_icon.png 25 August, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతగూడెంలో అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా!

25-08-2025 01:50:28 PM

అనుమతులు ఉంటే అర్థరాత్రి ఎందుకు...?

అంత మా ఇష్టమే అంటూ అర్ధరాత్రి ట్రాక్టర్లతో తరలిస్తున్న ఇసుక

ఇందిరమ్మ ఇండ్ల మాటున రవాణా చేస్తున్న వైనం

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం, చింతగూడెం గ్రామాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా రాత్రిపగలు తేడా లేకుండా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు.

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు

మండలంలోని చింతగూడెం గ్రామంలో ఉన్న చిన్నవాగులో ఆదివారం రాత్రి జేసిబితో ఇసుక అక్రమ రవాణా జరిగింది బుట్టాయిగూడెంలో ఉన్న హనుమంతుని వాగు నుండి రాత్రికి రాత్రే గ్రామ సరిహద్దును దాటుకోని రోజుకు పదుల సంఖ్యలో పలు గ్రామాలకు అర్ధరాత్రి నుంచి మొదలుకుని తెల్లవారుజాము వరకు ఇసుక వాహనాలు తరిలిపోతున్నాయి.

గ్రామస్థులకు నిద్ర కరువు

ఇసుక వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి మొదలుకుని తెల్లవారుజాము వరకు జన సంచారం లేని సమయంలో యథేచ్చగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. టాక్టర్లకు డెక్కులు పెట్టి పెద్ద శబ్దాలతో రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే సింగారం,ఏటూరు,చింతగూడెం, బుట్టాయిగూడెం గూర్రేవులా గ్రామాస్తుల నిద్ర కరువుగా మారింది ఈ ఇసుక ట్రాక్టర్‌లు శబ్ధానికి నిద్ర పట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇసుక వాహనాలు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల అవసరమే పెట్టుబడిగా ఇసుక అక్రమార్కుల దీమా

ఇసుక రవాణా సక్రమమే అయితే పగటి వేళల్లో తరలించకుండా రాత్రి వేళలో ఎందుకు తరలిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు తనిఖీలు చేసి ఇసుక వాహనాలను స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానాలు విధిస్తూ వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు చేసుకోనే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ఇసుక వ్యాపారులు ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పుకు రూ. 12వందల నుంచి 2వేల వరకు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

చోద్యం చూస్తున్న అధికారులు

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు