15 April, 2026 | 12:28 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా

31-10-2025 06:00 PM

కాసులు కురిపిస్తున్న మూసీ ఇసుక

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో మూసీ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా మూసీకి వస్తున్న వరదలతో మూసీ నదిలో పెద్ద ఎత్తున ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అయితే వరద తగ్గినప్పుడు ఇసుకను మూసీ నుండి ఇసుక అక్రమ రవాణాదారులు సేకరించి డంపులుగా చేసుకుని రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులకు మూసీ ఇసుక మూడు పువ్వులు, ఆరు కాయలుగా కాసులు కురిపిస్తుంది. వలిగొండ మండలంలోని మూసీ పరివాహక ప్రాంతాలైన గోకారం, ప్రొద్దుటూరు, లింగరాజుపల్లి, లోతుకుంట, గుర్నాథ్ పల్లి, వేములకొండ గ్రామాలలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా రాత్రి, పగలు అనే తేడా లేకుండా కొనసాగుతుంది.

ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడం గమనిస్తే దీనిని అధికారులు ఎవరూ పట్టించుకోనట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి  లబ్ధిదారులకు ఇసుకను ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు ఇసుక రవాణాదారులు 6,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుండడంతో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు  చేసేది ఏమీ లేక రవాణాదారులు చెప్పిన ధరను చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూసీ నుండి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.