12 June, 2026 | 1:22 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

సర్దార్ వల్లభాయ్ పటేల్ యువతకు స్ఫూర్తిదాయకం

31-10-2025 06:04 PM

కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్

నకిరేకల్,(విజయక్రాంతి): ఉక్కు మనిషి భారతదేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతరానికి, విద్యార్థులు ఎంతో స్ఫూర్తిదాయకమని కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కట్టంగూరు మండల కేంద్రంలో దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ని పురస్కరించుకొని దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా  విద్యార్థులు,  ప్రజలతో కలిసి 'సమైక్యత పరుగు' నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ తొలి హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు బాటలు వేశారని ఆయన కొనియాడారు. సర్దార్ సమయస్ఫూర్తి ధైర్యంతోనే  నాడు నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైనదని గుర్తు చేశారు. సర్దార్ పటేల్ ధైర్యసాహసాలు సాసోపేతమైన నిర్ణయాలతో ఉక్కుమనిషిగా ప్రత్యేక గుర్తింపును పొందారని ఆయన. నేటితరం ఆయన బాటలో పయనించి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.