15-08-2025 04:52:23 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జాతీయ జెండాఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... స్వాతంత్య్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసినమహనీయుల త్యాగాలను సందర్భంగా స్మరించుకున్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు, క్రమశిక్షణతో పాటు వారిలో దేశభక్తి భావాలు పెంపొందించే విధంగా కృషి చేయాలని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.