15 July, 2026 | 6:07 PM

Breaking News

మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ   •   నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   తెయూకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు   •   భాగిర్తిపల్లి గ్రామపంచాయతీకి బాడీ ఫ్రీజర్ విరాళం   •   ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి   •   లక్క పురుగుల బెడదతో విలవిలలాడుతున్న గ్రామాలు..!   •  

స్వదేశీ అస్త్ర క్షిపణి పరీక్ష సక్సెస్

13-07-2025 12:58 AM

న్యూఢిల్లీ, జూలై 12: స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో భారత్ కీలక ముందడుగు వేసింది. గగనతలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే అస్త్ర క్షిపణిని విజ యవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీతో దాన్ని ఆపరేట్ చేశారు. సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా అస్త్రను ప్రయోగించారు. వేర్వేరు రేంజ్‌ల్లో ఉన్న హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాలను పేల్చారు.

రెండు సందర్భాల్లోనూ అస్త్ర క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలనే ఛేదించింది. అస్త్ర బీవీఆర్‌ఏఏఎం (బిహాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్) సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను పేల్చగలదు. అత్యుత్తమమైన గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి. అస్త్రా క్షిపణి తయారీలో సుమారు 50 పబ్లిక్, ప్రైవేట్ పరిశ్రమలు పాలుపంచుకున్నాయి. అస్త్ర ప్రయోగం విజయవంతమవడంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, ఐఏఎఫ్ సంస్థల కృషిని ఆయన కొనియాడారు.