13 April, 2026 | 12:52 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

31-10-2025 07:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు ఇందిరా గాంధీ 41వ వర్ధంతి  వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు  మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.

దేశ సార్వభౌమత్వం కాపాడటంలో, పేదల అభ్యున్నతికి అమలు చేసిన గరీబీ హటావో పథకాలతో భారతీయ ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆమె ఆలోచనలు, నాయకత్వం ఈ తరం యువతకు స్ఫూర్తి కావాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సేవాదళం, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించారు.