17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-2025 05:09 PM

కాటారం (విజయక్రాంతి): భారతదేశ మొదటి మహిళ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాటారం మండలం ధన్వాడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన మహనీయురాలని, దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల యూత్ అధ్యక్షులు మహేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడిగె గిరీష్, చీకట్ల వెంకటేష్, తోట కిషోర్, బుర్రి సుధాకర్, పుట్ట రాజేందర్, రఘునందన్, కోడి రవికుమార్, కొండ్ర శివ, శ్రీకాంత్, చిటూరి రాజేష్, గణేష్, కొండ్ర శ్రీకాంత్, చింటూ, తదితరులు పాల్గొన్నారు.