24-01-2026 12:24:11 AM
మరిపెడ , జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేస్తుందని మరిపెడ మండలం గిరిపురం సర్పంచ్ నీలాసైదులు అన్నారు. శుక్రవారం గ్రామంలో అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందించారు.
అ నంతరం సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభు త్వం ఇచ్చిన చీరలను ఎవరు కట్టుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో నాణ్యమైన చీరలు ఇస్తున్నందుకు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య క్ర మంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు బా దావత్ సైదులు నాయక్, పట్ల మల్లయ్య, మహి ళలు తదితరులు పాల్గొన్నారు.