10-09-2025 05:32:35 PM
ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు
ఖానాపూర్ (విజయక్రాంతి): ఈనెల చివరి వరకు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ పనులు పూర్తి చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు(MPDO CH Ratnakar Rao) సూచించారు. ఈ మేరకు బుధవారం మండలంలోని బాదన కుర్తి గ్రామంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పనులు పరిశీలించి పనులు త్వరితగతిన చేయాలని లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.