10-12-2025 12:28:08 AM
సూర్యాపేట, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ దీక్షకు తలొగ్గినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన డిసెంబర్ 9న బీఆర్ఎస్ జరుపుకునే దీక్ష దివస్ ను మంగళవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ గాలిలోకి బెలూన్లో ఎగురవేసి.. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలా భిషేకం చేసి, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.