4 July, 2026 | 11:16 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఆర్టీఐ కమిషన్‌లో బీసీలకు అన్యాయం

21-05-2025 12:50 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు బీసీనేతల వినతి 

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టంలో బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చిన సమాచార కమిషన్‌లో ఇద్దరు ఓసీలు, ఒక ఎస్సీ, ఒక మైనార్టీకి అవకాశం ఇచ్చారని, బీసీలను విస్మరించారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగ ణనలో బీసీలు 56 శాతం ఉన్నట్లుగా తేలిందని, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం భర్తీచేసే పోస్టుల్లోనూ బీసీలకు న్యాయం చేయాలని, లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయన్నారు.

మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజ్‌గౌడ్, బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, నాయకులు అయిలి వెంకన్న, ఎలికట్టు విజయ్‌కుమార్, ఇంద్రం రజక, భాస్కర్ తదితరులు ఉన్నారు.