17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విధుల నుంచి తొలగించి రోడ్డున పడేశారు..

21-05-2025 09:57 PM

మీడియా ముందు బాధితుల మొర..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కర్జీ ఇసుక రీచ్ లో ఏడేళ్లుగా సాండ్ రీచ్ అసిస్టెంట్ లు గా పనిచేస్తున్న తమను అకారణంగా విధుల నుంచి తొలగించారని బాధితులు గొర్లపల్లి అశోక్, గణపతి అంజన్నలు తెలిపారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు విలేకరులకు తమ గోడును వెళ్ళబుచ్చుకొన్నారు. ఏడేళ్లుగా ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా పనిచేస్తూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయం తీసుకువస్తున్నామని వారు తెలిపారు.

నెన్నెల మండలానికి చెందిన నాయకుడు హరీష్ గౌడ్, కన్నెపల్లి మండలానికి చెందిన నర్సింగరావులు జిల్లా కలెక్టర్, మైనింగ్ ఏడీ లకు చెప్పి రాజకీయ వత్తిడి తెచ్చి తమను అకారణంగా విధుల నుంచి తొలగించి తమను తమ కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. గోడు చెప్పుకుందామని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తే పీఏలు తమను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలువ నీయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ మైనింగ్ ఏడీలు వెంటనే స్పందించి తమను విధుల్లోకి తీసుకోనేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ఆదుకోవాలని వారు వేడుకున్నారు.