calender_icon.png 5 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తన దుకాణాల్లో తనిఖీలు

05-07-2025 12:31:19 AM

కామారెడ్డి, జూలై 04,(విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ శాఖ , పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ అధికారులు నదీం, రాజలింగంతో పాటు ఎస్త్స్ర ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించినవారిపై శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

రశీదులు తీసుకోవాలి..

రైతులు ఫర్టిలైజర్ దుకాణాల్లో  మందు లు తీసుకున్న అనంతరం తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని వ్యవసాయ, పోలీ సు శాఖల అధికారులు సూచించారు. ఎరు వులు తీసుకున్న తర్వాత రశీదులు తీసు కుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంద న్నారు. విత్తన దుకాణాదారులు సైతం కమీ షన్లకు ఆశపడి నాణ్యతలేని వంగడాలను రైతులకు అంటగట్టవద్దని సూచించారు.