జగిత్యాలలో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
10-04-2025 01:57 PM
జగిత్యాల,(విజయక్రాంతి): తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. రూ.25 లక్షల విలువైన బంగారాన్ని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంచిర్యాలకు చెందిన అజయ్ కుమార్ గా గుర్తించారు.






