17 June, 2026 | 12:21 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

18-12-2025 06:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండలం, న్యూ సాంగ్వి గ్రామంలో నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఏజెంట్లకు అవగాహన కల్పించారు. గల్ఫ్ దేశాలు వెళ్లే ప్రతి కార్మికుడు శిక్షణ పొంది సర్టిఫికెట్ కలిగి, బీమా పాలసీ చేయించుకొని వెళ్లి, క్షేమంగా తిరిగివచ్చినప్పుడే కుటుంబానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశ్విన్ రెడ్డి, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి అనసూయ, వార్డ్ మేంబర్లు, యూనియన్ కోఆర్డినేటర్ కొమ్ము గీత, నాయకులు సుశీల, గంగాధర్, రాజేశ్వర్ పెద్ద ఎత్తున గల్ఫ్ కుటుంబాల సభ్యులు, గల్ఫ్ రిటర్నిలు, గ్రామస్థులు పాల్గొన్నారు.