19 May, 2026 | 10:19 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

అన్నదానంతో ఆకలి తీర్చడం అభినందనీయం

22-09-2025 12:18 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) :  అన్నదానంతో ఆకలి తీర్చడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం మహాలయ పక్ష అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా సుమన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్నేహితులంతా కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు.

మహాలయ పక్ష అమావాస్య రోజున చేసే అన్నదానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, బ్రహ్మండ్లపల్లి మురళీధర్,ఈగ దయాకర్, నరేంద్రుని విద్యాసాగర్, బెలిదే అంజయ్య, గోరెంట్ల సంపత్,పబ్బా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.