25 July, 2026 | 11:24 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

విద్యార్థులకు ఐటీసీ సహకారం అభినందనీయం

15-07-2025 12:45 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, జులై 14 ( విజయ క్రాంతి ) : ఏజెన్సీ ప్రాంతంలో ఐటీసీ సంస్థ విద్యార్థులకు సహకారం అందించి, ఉచితంగా సైకిళ్ల ను పంపిణీ చేయడం అభినందనీ యమని పినపాక ఎ మ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జడ్పీహెచ్‌ఎస్ కో ఎడ్యుకేషన్ పాఠశాల వి ద్యార్థులకు ఐటిసి ఆధ్వర్యంలో సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఐటిసి చేస్తున్న కార్యక్రమాలు అభినంద నీయమన్నారు. సి ఎస్‌ఆర్ నిధులతో గ్రామాలలో మౌలిక వసతులు, విద్యా, వైద్య రంగాలలో సంస్థ అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు.

ఏజెన్సీలోని పేదల ఆర్థిక అభివృద్ధికి ఐటీసీ అన్ని విధాలా చేయతను అంది స్తుందని,యాజమాన్యం కరోనా సమయంలో కూడా సేవా కార్యక్ర మాలు నిర్వ హించిందన్నారు. కార్యక్రమంలో ఐటీసీ అధికారులు చెంగళరావు, తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో తెల్లూరి శ్రీనివాస్,ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ స్వర్ణ జ్యోతి, హెచ్‌ఎం నాగ శ్రీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, కూరపాటి సౌజన్య పాల్గొన్నారు.