04-07-2025 11:49:51 PM
రోశయ్య జయంతి సభలో ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కర్షక నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసి తెలుగుజాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి కీర్తిశేషులైన కొణిజేటి రోశయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ కూర్పులో ఘనపాటిగా పేరుందిన మహా నాయకుడు కొణిజేటి రోశయ్య అని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం ఐటిడిఏ కార్యాలయపు సమావేశ మందిరంలో మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య 92 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ప్రాజెక్టు అధికారి రాహుల్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య 1933వ సంవత్సరం జూలై 4 న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారని, గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ మరియు వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారని, ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1968 నుండి 1980 సంవత్సరం వరకు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.
తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు భవనాలు, రవాణా శాఖ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రి వర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్h ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్ గా తన సేవలు అందించారని, అటువంటి మహానియుడుని స్మరించుకుంటూ మనమందరం పట్టుదలగా పనిచేసి మన ఉద్యోగ ధర్మాన్ని గిరిజన ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఉన్నారు.