27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

హెచ్‌ఎండీఏకు జాక్‌పాట్

06-12-2025 12:00 AM
  1. భూముల వేలంతో రూ. 3,862 కోట్లు..
  2. చివరి రోజు గోల్డెన్ మైల్‌లో ఎకరం ధర రూ.77.75 కోట్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టిన భూముల వేలం ప్రక్రియ ఘనంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాంతాల్లో జరిగిన ఈ--వేలం ద్వారా హెచ్‌ఎండీఏ ఖజానాకు కనకవర్షం కురిసింది. గురువారంతో ముగిసిన ఈ మొత్తం సిరీస్ ద్వారా ప్రభుత్వం ఏకంగా రూ. 3,862.8 కోట్ల భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది.

వేలం పాట చివరి అంకంలో భాగంగా గురువారం గోల్డెన్ మైల్‌లోని 1.98 ఎకరాల స్థలానికి వేలం నిర్వహించారు. వాస్తవానికి ఈ స్థలం ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ బిడ్డింగ్‌లో కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విజేతగా నిలిచింది. ఈ సంస్థ ఎకరాకు రూ. 77.75 కోట్లు వెచ్చించి ఈ స్థలాన్ని సొంతం చేసుకుంది.

స్థలం ఆకారం ఎలా ఉన్నా, లొకేషన్ డిమాండ్ కారణంగా ఇంత భారీ ధర పలికిందని అధికారులు తెలిపారు. ఈ వేలం ప్రక్రియకు ట్రాన్సాక్షన్ సలహాదారులుగా కుష్మాన్ , వేక్‌ఫీల్డ్ ,ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫామ్‌గా ఎంఎస్‌టీసీ వ్యవహరించాయి. వచ్చిన ఆదాయం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సత్తాను మరోసారి చాటిచెప్పింది.