10-02-2025 01:22:43 AM
* వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, ఫిబ్రవరి 9: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా నిలిచే వారే పాత్రికేయలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోనీ 2వ బైపాస్ రోడ్డులో గల మహదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( టీయూడ బ్ల్యూజే హె-143) కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల మహాసభ కు రాష్ర్ట అధ్యక్షులు అల్లం నారాయణతో కలిసి ము ఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
దేశంలో నే ఫోర్త్ ఎస్టేట్గా మీడియా రంగం ఉంద న్నారు. స్వతంత్ర ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర మరువ లేనిదన్నారు. పాత్రికేయులు సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటాలకు అండగా ఉంటూ, నిజల ను నిర్భయంగా సమాజానికి అందిస్తున్నారని అన్నారు.
పాత్రికేయులు ఒక్కొక్కరు 100 మందితో సమానమని, వారి తో 1987 నుంచి నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. నా రాజకీయ జీవితంలో పాత్రి కేయుల పాత్ర మరువలేనిదని, వేములవాడ ఎమ్మెల్యేగా గెలవడంలో పాత్రికేయుల పాత్ర ప్రత్యేకమైనదని, ఆ గెలుపులో భాగస్వామ్య మైన పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవా దాలన్నారు.
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందజేయడం జరుగుతుందన్నా రు. పేద ప్రజలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీ కలం ద్వారా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా చేయాలన్నారు. పౌర సత్వం పై పోరాటం చేస్తున్నప్పుడు నాకు పార్టీ నాయకులు, స్నేహితుల శ్రేయోభిలాషు లతో పాటు పాత్రికేయులు మనోధైర్యాన్ని కల్పించారన్నారు.
మీడియా మిత్రుల కష్టసు ఖాల్లో పాలుపంచుకుంటా వారికి అండగా ఉంటామన్నారు. వేములవాడ రాజన్న ఆల య అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, త్వరలోనే నిత్య అన్నదాన సత్రానికి భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు. ఇలాం టి కార్యక్రమాలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల పాత్రికే యులు పాల్గొన్నారు.