04-07-2025 08:16:51 PM
బచ్చన్నపేట,(విజయక్రాంతి): జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రామానుజాచారి ని, డిప్యూటీ తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శంకర్ ని, బచ్చన్నపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, జంగిలి సాయిబాబా ఆధ్వర్యంలో జర్నలిస్టులు పాల్గొని శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఏ గ్రామంలో ఏం జరిగినా ముందుగా సమాచారం తెలిసేది జర్నలిస్టులకు అని ఎలాంటి సమాచారం తెలిసిన మా దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.