9 May, 2026 | 10:44 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

కలెక్టర్ సారు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి

04-07-2025 08:22 PM

చినుకు పడితే చిత్తడిగా మారుతున్న ప్రధాన రోడ్లు

గ్రామస్తులు ఎంపిడిఓని అడిగితే మా వల్ల కాదు.. కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీని అడగండని సమాధానం

అధికారులు నిర్లక్ష్యమే కారణం..!

కాంగ్రెస్ పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ మనోజ్

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో సైడ్ కాలువలు లేకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా ఇళ్లలోకి ప్రవహిస్తూ స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గ్రామ రహదారులపై నిలిచిపోయిన నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పునరావృతమవుతున్న సమస్యపై గ్రామస్తులు శుక్రవారం ఎంపీడీఓ. కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ సమస్యపై ప్రశ్నించగా ఎంపిడిఓ అనిత మాకు ఏమి తెలియదు. నేను నామమాత్రంగా ఉన్నానంటూ గ్రామస్తులకు అసంతృప్తికర సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా "కలెక్టర్కు ఫిర్యాదు చేయండి అంటూ అధికారి చేతులెత్తేసినట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ స్పందిస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎన్నోసార్లు కార్యదర్శిని అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎంపిడిఓని ప్రశ్నించినా మా వల్ల కాదు... ఎమ్మెల్యేను లేదా ఎంపీని అడగండి అనే తీరుతో ప్రజలను నిరాశకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.