16 April, 2026 | 11:22 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జూబ్లీహిల్స్ బరిలో ఉద్యమకారుల ఫోరం

20-10-2025 01:42 AM

ముషీరాబాద్, అక్టోబర్ 19 (వికాయక్రాంతి): అన్ని రాజకీయ పార్టీలకు ఉధ్యమకారుల ఆవేదనను తెలియజేయడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉధ్యమకారుల ఫోరం తరపున సీనియర్ ఉధ్యమ కారుడు బందెల ఇందర్ కుమార్ ను బరిలో నిలుపుతున్నట్లు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా స్వామి స్పష్టం చేశారు. ఈనెల 21న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.

ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రేటర్ అధ్యక్షుడు గుండు దయానంద్, కన్వీనర్ జగన్ యాదవ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర నాయకులు తాడూరి గగన్ కుమార్, వీరస్వామి, విష్ణువర్ధన్, జానకిరెడ్డి, నరేందర్ గౌడ్ లతో కలసి ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని వారు ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాన ఉధ్యమకారులను పూర్తిగా విస్మరించాయని, ఉధ్యమమంలో పాల్గొనని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శివ కుమార్, రాజేందర్, భాను ప్రకాష్ రెడ్డి, నస్రీన్, మాణిక్యం, మోహన్ చారి, జగన్ తదితరులు పాల్గొన్నారు.