13 April, 2026 | 4:23 PM

Breaking News

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •  

సుల్తానాబాద్‌లో కన్నుల పండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు

05-11-2025 03:57 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా, కన్నుల పండుగగా బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో జరిగాయి. దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున  ఉదయం 5 గంటల నుంచి దేవాలయాలకు పోటెత్తారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో  దేవాలయాలు  సందడిగా మారాయి. మహిళలు పెద్ద ఎత్తున శివలింగం, నందీశ్వర విగ్రహాల వద్ద, ఉసిరి చెట్టు వద్ద కార్తీక ఉసిరిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పలు రకాల నైవేద్యాలను  సమర్పించారు.

సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీ సాంబశివ దేవాలయం, పాత బజార్లోని శ్రీ శివాలయం, గుడిమిట్టపల్లి శివాలయం, పెరిగిద్ద ఆంజనేయస్వామి దేవాలయం, వాసవి మాత దేవాలయం, శాస్త్రి నగర్ అభయ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, పారువెల్ల రమేష్ శర్మ, సాయి ప్రణవ్, వల్ల కొండ మఠం మహేష్, రమేష్, పోలస అశోక్, కొండపలకల అభిలాష్ శర్మ, పారువెల్ల సంతోష్ శర్మ, గూడ రమేష్ శర్మలు భక్తులు, దంపతుల చే ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్లు పల్లా మురళీధర్, అల్లంకి సత్యనారాయణ, ఆకుల రామేశ్వర్ రెడ్డి, చకిలం మారుతి, మారవేణి లచ్చయ్య , పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్  కొమురవెల్లి భాస్కర్, సాదుల సుగుణాకర్, సామల హరికృష్ణతో పాటు శ్రీ సాంబశివ దేవాలయం అర్చకులు  రమేష్ శర్మ అసిస్టెంట్ బండి రామ్మోహన్ , భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.