27 July, 2026 | 12:55 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

తుంగతుర్తిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

05-11-2025 05:48 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు శివాలయాలలో అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు శివాలయాల్లో, తమ తమ గృహాలలో కార్తీకదీపాలను అలాగే తులసి మాతకు దీపాలను, ఉసిరి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొనకొండ రమేష్ సంధ్య, స్వాములు, కాంతయాచారి ,సత్యనారాయణ ,నిరంజన్రెడ్డి ,శ్రీకాంత్ ,రాము ,సతీష్ మహేష్, బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని స్వరూప రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.