27 June, 2026 | 7:45 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

కేదారేశ్వర స్వామి అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలి

10-05-2025 11:51 PM

టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

మునుగోడు,(విజయక్రాంతి): కేదారేశ్వర స్వామి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని స్వామి దీవెనలతో పాడిపంటలు పశుసంపద అష్టైశ్వర్యాలతో రాష్ట్రం వర్ధిల్లాలని టిపిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కోతులారం గ్రామంలో కేదారేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, టిపిసిసి అధికార ప్రతినిధి ఉన్న కైలాస్ నేత తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పలహారాలను సేవించారు.

పెహల్గాంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడి దురదృష్టకరమని పాకిస్తాన్ పై విరోచితంగా పోరాడుతున్న సైనికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరహంతకు రాక్షసుల ఉగ్రవాదులను హతం చేసి దేశ సేవ కోసం పోరాడుతున్న వీరులకు వందనాలని అన్నారు. అంతకుముందు నూతనంగా ఆధునికరించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన టిపిసిసి అధ్యక్షునికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూల ఓకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీమనపల్లి సైదులు, మాజీ సర్పంచ్ జాజుల పారిజాత సత్యనారాయణ, జాల వెంకటేశ్వర్లు,తాటికొండ సైదులు, వట్టి కోటి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.