17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చేపల వేటకు వెళ్ళిన యువకుడు మృతి

10-05-2025 11:48 PM

చేగుంట/నార్సింగి,(విజయక్రాంతి): చేపల వేటకు వెళ్ళి చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్,తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన చందంపేట నరేష్ (30), అవివాహితుడు, రోజు వారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం చేపల వేటకని మండల కేంద్రంలోని ఖాన్ తలాబ్ ( కాముని చెరువు) కు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. నరేష్ కుటుంబ సభ్యులు అతను బంధువుల వద్దకు వెళ్ళాడని భావించారు. శుక్రవారం మధ్యాహ్నం చెరువులో మృతదేహం తెలిగా నరేష్, నీట మునిగాడన్న విషయం తెలిసింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పంచనామా నిర్వహించి, పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రి కి తరలించారు. నరేష్ బంధువుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ తెలిపారు.