16 April, 2026 | 11:52 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

రిటర్మైంట్ వార్తల వేళ కోహ్లీ ఆసక్తికర ట్వీట్

17-10-2025 01:06 AM

పెర్త్,అక్టోబర్ 16: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు రెడీ అవుతోంది. ఆదివారం పెర్త్ వేదికగా జరగబోయే మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీపైనే అంద రి చూపు ఉంది. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన కింగ్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడతాడా.. జట్టులో అతనికి చోటు దక్కుతుందా లేదా అనే దానిపై విపరీతంగా చర్చ జరుగుతోంది.

ఆసీస్ టూర్‌లో చెలరేగితే వరల్డ్‌కప్ జట్టులో ఉన్నట్టేనంటూ వార్త లు వస్తున్నాయి. ఒకవేళ ఫెయిలైతే మాత్రం ఆసీస్ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడ న్న ప్రచారం మొదలైంది.ఈ నేపథ్యంలో వి రాట్ కోహ్లీ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు ఫెయిలై నట్టే అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కోహ్లీ ట్వీట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిం ది. ఈ ఒక్క ట్వీట్‌తో రిటైర్మెంట్ వార్తలకు విరాట్ చెక్ పెట్టేశాడని పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆసీస్‌పై కోహ్లీ ఫెయిలైనా కూడా ప్రపంచకప్ జట్టులో అతనిలాంటి ఆటగాడు ఉండా ల్సిందనని పలువురు మాజీలు అభిపాయపడుతున్నారు.