20 June, 2026 | 4:07 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

టీపీఆర్‌పీలోకి కూనపరెడ్డి హరి ప్రసాద్

13-10-2025 12:27 AM

కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు జిలకర రవికుమార్

ముషీరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ (టీపీఆర్‌పీ)లోకి రిటైర్డ్ ఐఐఎస్ ఆఫీసర్ కూనపరెడ్డి హరిప్రసాద్ ను ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాలలో సేవలందించిన ప్రసాద్ అవినీ తిరహిత పాలన కోసం రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం అన్నారు.

టిపిఆర్ పి విధి విధానాలు నచ్చి పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో కొత్త రాజకీయ నాయకులు రావాలనే నినాదంతో టిపిఆర్ పి ద్వారా రెండు రాష్ట్రాలకు నాయకులను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. పాత రాజకీయ నాయకులు పోయి, కొత్త రాజకీయ నాయకులు రావాలని ఆకాంక్షతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా హరి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రాన్ని బిజెపికి, రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చిన ప్రజలు స్థానిక సంస్థలు, జెడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ కూడా కైవసం చేసుకొని పరిపాలన ఏ విధంగా ఉండాలనేది రాష్ట్రానికి చూపించే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి శ్యామ్ రావు, పావిళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.