16-08-2025 12:05:58 AM
-ప్రాజెక్ట్ 14 గేట్ల నుంచి నీటి విడుదల
నాగార్జునసాగర్(విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు ఎన్ఎస్పీ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం మరియు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 1,46,296 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుంది.
దీనితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 586.90 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 3004.9865 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుండి మొత్తం 1,44,776క్యూసెక్కుల నీటిని 14 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.