16-08-2025 12:06:25 AM
నాగారం: నాగారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీ ఓ ,ఇన్చార్జి ఎంపిడిఓ గా విధులు నిర్వహిస్తున్న మారయ్య విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు చేసిన ఉత్తమ సేవకు గాను గుర్తింపుగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తమ అవార్డుకు ఎంపికైనారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ను కార్యాలయ సిబ్బంది , పలువురు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. మరెన్నో ఉత్తమ అవార్డు లు అందుకోవాలని అని కోరారు.