18-12-2025 01:58:03 AM
డిచ్ పల్లి, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ప్రొఫెసర్ రమణాచారి పర్యవేక్షణలో పరిశొధక విద్యార్థి కుమ్మరి కృష్ణ ప్రసాద్ ‘సెల్ఫ్, సొసైటీ అండ్ ద మిడిల్ క్లాస్ ఇన్ ద సెలెక్టెడ్ నావల్స్ ఆఫ్ మంజు కపూర్‘ అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథం పై బుధవారం మౌఖిక పరీక్ష జరిగింది. ఈ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ఎగ్జామినర్ వారి హైద్రాబాద్ నుండి ప్రొఫెసర్ సోన్బా సాల్వే హాజరై సిద్ధాంత గ్రంధాన్ని సమీక్షించి కుమ్మరి కృష్ణ ప్రసాద్ కు పీహెచ్డీ అవార్డు ప్రధానం చేయాల్సిందిగా విశ్వవిద్యాలయ అధికారులకు సూచించినారు.
ఈ మౌఖిక పరీక్ష లో డీన్ ప్రొఫెసర్ లావణ్య, హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంటు డాక్టర్. సమత బొర్డ్ ఆఫ్ స్టడిస్ డాక్టర్ కె.వి.రమణ చారి, ఫ్యాకల్టీ డాక్టర్ స్వామి రావు, డా.జ్యోత్న, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్డీ సాధించిన కుమ్మరి కృష్ణ ప్రసాద్ ని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి, మరియు పరీక్షల నియంత్రణ అధికారి కె.సంపత్ కూమార్ ప్రత్యేకంగ అభినందనలు తెలిపారు.