16 April, 2026 | 10:29 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి

08-05-2025 12:56 AM

బోథ్, మే 7 (విజయక్రాంతి):  ఎస్టీ జాబి తా నుండి లంబాడాలను తొలగించేంత వరకు  ఉద్యమం కొనసాగిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాన అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు. గతంలో లంబాడాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో భాగంగా తుడుం దెబ్బ నాయకులపై  పెట్టిన కేసుల విషయమై బుధవారం బోథ్ కోర్టుకు హాజరైన సందర్భంగా తుడుం దెబ్బ నాయకు లతో కలిసి ఆయన మీడియాలో మాట్లాడారు.

ఎన్ని అక్రమ కేసులు బనాయించిన  వెనక్కి తగ్గేదే లేదని, ఎన్ని కేసులునైనా ఎదుర్కొంటామన్నారు. కోర్టుకు హాజరైన వారిలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు కోడప నగే ష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కుడాల స్వామి, జిల్లా నాయకులు రామేల్లి భోజ్జన్న, ఐటీడీఏ   మాజీ డైరెక్టర్ మెస్రం భూమన్న, కుర్మే రాజన్న  తదితరులు పాల్గొన్నారు.