16 April, 2026 | 10:27 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

భక్తిశ్రద్ధలతో వాసవీమాత జయంతి

08-05-2025 12:58 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే7(విజయక్రాంతి): వాసవీ కనక పరమేశ్వరి జయంతి వేడుకలను ఆలయ కమిటీ, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం ఆసిఫా-బాద్ పట్టణం లోని వాసవీ ఆలయంలో అర్చకులు రాజశేఖర్ శర్మ, శేఖర్ శర్మ, నరేష్ శర్మ ఆధ్వ-ర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అష్టాదశ హారతులు ఇచ్చారు.

వాసవి మాత జయంతిని పురస్కరించుకొని ఆలయంలో అభిషేకాలు చేపట్టారు. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం పట్టణంలోని పురవీధుల గుండా అమ్మవారి ఉత్సవ విగ్ర-హంతో శోభాయాత్ర నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఉయ్యాల సేవ అనంతరం భక్తులకు మహాన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు రావుల శంక ర్, కార్యదర్శి వెంకన్న, కోశాధికారి మురళి, వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు  పాత శ్రీనివాస్ కృష్ణమూర్తి, కిషోర్, గంధం శ్రీనివాస్, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు