08-01-2026 12:49:45 AM
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్లో ఒకటైన ఇన్ఫినిటీ లెర్న్, అలాగే శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ముందడుగైన సంస్థ బుధవారం ’ఇన్ఫినిటీ వన్’ అనే ప్రీమియం వ్యక్తిగత 1:1 ఆన్లైన్ ట్యూషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం సీబీఎస్ఈ, ఫౌండేషన్, జేఈఈ, నీట్ విభాగాల్లో తరగతులు 4 నుంచి 12 వరకు చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 100% లైవ్ 1:1 క్లాసులు, ప్రత్యేకంగా కేటాయించిన ఉపాధ్యాయులతో నిర్వహించబడతాయి. దీని వల్ల ప్రతి విద్యార్థి యొక్క వేగం, బలాలు మ రియు మెరుగుదల అవసరాలకు అనుగుణంగా బోధన జరుగుతుంది.
ప్రతి విద్యార్థి ఒక సమగ్ర ఇండక్షన్, డయాగ్నోస్టిక్ ప్రక్రియతో ప్రారంభించి, స్కూల్ కరిక్యులమ్, పో టీ పరీక్షల లక్ష్యాలకు అనుసంధానమైన వ్యక్తిగత అకడమిక్ ప్లాన్ను పొందుతాడు. 11వ, 12వ తరగతి విద్యార్థుల కోసం, ఈ ప్రోగ్రా మ్లో క్రమబద్ధమైన టెస్ట్ ప్రిపరేషన్, పనితీరు విశ్లేషణ, మానసిక శ్రేయస్సు (వెల్బీయింగ్) సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది పరీక్షల ఒత్తిడిని తగ్గించి మెరుగైన సంసిద్ధతకు సహాయ పడుతుంది.
శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సీఈవో, డైరెక్టర్ సుష్మా బొప్పన మాట్లాడుతూ.. ‘ఇన్ఫినిటీ వన్ ద్వారా అకడమిక్ కఠినత, వ్యక్తిగత మార్గదర్శకత్వం, నిరం తర ఫీడ్బ్యాక్ ఒకటిగా కలుస్తాయి. ఇది వి ద్యార్థులు తమ లక్ష్యాలను మించి సాధించడానికి అవసరమైన నిజమైన సహాయాన్ని అందిస్తుంది అన్నారు. ఇన్ఫినిటీ లెర్న్ ఫౌం డింగ్ సీఈవో ఉజ్జ్వల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇన్ఫినిటీ వన్లో సిలబస్ పూర్తయిందా అని మేము అడగం. విద్యార్థి ఆ సమస్యను పరిష్కరించగలడా లేదా అన్నదే మేము చూ స్తాం‘ అని అన్నారు. ఇన్ఫినిటీ వన్తో మే ము టీచర్ పాత్ర అధ్యాయాన్ని ముందుకు తీసుకెళ్లడం కాదు విద్యార్థి ఎక్కడ అడ్డంకి ఎదుర్కొంటున్నాడో అక్కడే నిలబడి, స్పష్టత వచ్చేవరకు సహాయం చేయడం అన్నారు.