15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఎన్నిక‌ల నిబంధ‌న‌లు పాటించ‌కుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు

27-11-2025 10:24 PM

మునిప‌ల్లి ఎస్ఐ రాజేష్ నాయ‌క్

మునిపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల నియ‌మ నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని  మునిప‌ల్లి ఎస్ఐ రాజేష్  నాయ‌క్ హెచ్చ‌రించారు. గురువారం స్థానిక పీఎస్ లో స్థానిక విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల దృష్ట్యా మూడు విడతలుగా జరగనున్న ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున రూ. 50 వేల‌కు మించ‌కుండా త‌మ వెంట తీసుకెళ్ల‌వ‌ద్ద‌న్నారు. అలాగే రూ.50 వేలకు మించి డబ్బులు, నగలు వంటి విలువైన వస్తువులు ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు త‌ప్ప‌ని స‌రిగా పెట్టుకోవాల‌ని, అందుకు సంబంధించి ప‌త్రాలు లేనిచో వాటిని సీజ్ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

అదేవిధంగా జ‌ప్తు అయిన వ‌స్తువ‌ల‌కు సంబంధించి స‌రైన ప‌త్రాలు చూపించిన త‌రువాత తిరిగి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఎవరైనా ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం విధించిన నియమనిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ముఖ్యంగా స‌ర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం, శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌లంద‌రూ గ‌మ‌నించి ఎన్నిక‌లను స‌జావుగా సాగేలాచూసి త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.